Mana Bharosa – మన భరోసా

Home|Mana Bharosa – మన భరోసా

Mana Bharosa - మన భరోసా

పోలండ్ లో ఉన్న ప్రతియొక్క తెలుగు వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం ఉద్దేశించి ప్రారంభిస్తున్నదే మన భరోసా. ఎంతోమంది మన తెలుగు వారు ఎన్నో ఆశలతో, ఆశయాలతో కుటుంబాన్ని వదిలి ఈ దేశానికీ వంటరిగా వస్తున్నారు. వారిలో చాలా మంది పెద్ద నగరాల్లో కాకుండా చిన్న చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు. అక్కడ వారికి, పోలిష్ భాష ఇబ్బంది వలన ఇక్కడ ఉన్న పోలిష్ ఇన్సూరెన్స్ పధకాలలో చేరటానికి ఇబ్బందికి గురి అవ్వుతున్నారు. మన తెలుగు వారికి సహాయం చేయటంలో ఎప్పుడు ముందు ఉండే మన పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA), ఇతర తెలుగు గ్రూప్స్ (పోలండ్ తెలుగు సంఘం, పోలాండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం) వారితో కలసి సంయుక్తంగా ఈపధకాన్ని ప్రారంభిస్తున్నాము అని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము.

కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు

ఇది ఒక అత్యవసర నిధి (Emergency Fund). ఇందులో నమోదు చేసుకున్న సభ్యులకు అత్యువసర పరిస్తితులలో అనగా అనారోగ్యరీత్యా ఆసుపత్రిలో చేరిన సంధర్భంలో సభ్యునికి అండగా ఉండటం జరుగుతుంది. అలాగే అనుకోని పరిస్థితులలో మరణం సంభవించినప్పుడు పోలాండ్ లో అవసరమైన అన్ని అనుమతులకు మరియి పార్థివదేహం ఇండియా పంపించటానికి కమిటీ వారి నిర్ణయం తో ఈ పధకంలోని నిధిని వాడటం జరుగుతుంది.

మీకు తెలిసినట్టుగా, PoTA పోలాండ్ లో అధికారికంగా (KRS: 0001044512) స్థాపించబడిన సేవా సంస్థ. పోలాండ్ లో తెలుగు వారికి సహాయపడుటకు ముందుకు వచ్చిన ఇతర తెలుగు గ్రూప్స్ (పోలండ్ తెలుగు సంఘం, పోలాండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం) తో కలసి ఒక కమిటీగా తయారు అవ్వటం జరిగింది. వీరందరూ పోలాండ్ బ్యాంకు లో ఒక జాయింట్ బ్యాంకు అకౌంట్ తెరవటం జరిగింది. ఈ పధకం ద్వారా సమకూరిన అమౌంట్ మొత్తం ను అత్యవసర సేవలకు మాత్రమే ప్రతీఒక్కటీ కమిటీ వారి అనుమతి తో వాడటం జరుగుతుంది.

మీరు చేయవలసిందల్లా ప్రతి నెల ఏ రోజు లో అయిన మీరు మీ అకౌంట్ నుంచి మాత్రమే 15 PLN (పదిహేను జ్లోటీలు) ను జాయింట్ అకౌంట్ కు బదిలీ చేయాలి. (బదిలీ లో మీ పూర్తి పేరును స్పస్టం గా ప్రస్తావించాలి. లేదంటే పరిగణించపడదు).

మీరు కట్టిన నాలుగవ నెల నుంచి మీరు ఈ పధకం ద్వారా లబ్ధి పొందుతారు.

క్షమించాలి. ఈ పధకం యాక్టీవ్ గా ఉన్న సభ్యునికి మాత్రమే వర్తిస్తుంది.

మీరు మీ శ్రేయస్సు కొరకు ఒక సంవత్సరం లో 180 PLN ను కడుతున్నారు. ఒకవేళ మీరు పోలాండ్ ని శాశ్వతంగా వదిలి వెళ్ళిన సందర్భం లో మీ అమౌంట్ ని మరియొక వ్యక్తికి ఆపద సమయంలో మాత్రమే వినియోగించం జరుగుతుంది.

ఇది పోలాండ్ లో ఉన్నంతవరకు అనగా, ఆరోగ్యరీత్య అవసరాలకు మరియి అనుకోని పరిస్థితులలో మరణం సంభవించినప్పుడు వారి పార్థివదేహం ఇండియా పంపించటానికి అవసరమైన ఖర్చులకు మాత్రమే ఉపయోగించపడుతుంది.

మీరు వెంటనే మీకు కేటాయించిన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి, మీ పరిస్థితిని తెలియచేయండి. వెనువెంటనే చేయవలిసిన అత్యవసర కార్యక్రమాలను కమిటీ ప్రారంభిస్తుంది.

అమౌంట్ ను నేరుగా ఏ వ్యక్తికి చెల్లించబడదు. వైద్య చికిత్స లేదా మరేదైనా ఇతర అత్యవసర సేవలకు మాత్రమే, గరిష్టం గా 2500 PLN వరకూ చెల్లించబడుతుంది. (అనగా మీరు సంవత్సరానికి కడుతున్న అమౌంట్ కు 14 రెట్లు)

తప్పకుండా, ప్రతి సంవత్సరం (31-డిసెంబర్) న ప్రతి సభ్యునకు తెలిసేలా ఒక శ్వేతపత్రం అన్ని వివరాలతో విడుదల చేయటం జరుగుతుయింది.

ఈ మంచి ప్రయత్నంలో అందరూ పాలు పంచుకోవచ్చు. దీని ద్వారా మీ వలన వేరొకరికి ఆపద సమయం లో సహాయం చేసిన వారు అవ్వుతారు.

COPYRIGHT BY FUNDACJA PoTA

Fundacja PoTA, Zygmunta Modzelewskiego 58A / 50, 02-679 Warszawa, Polska
KRS: 0001044512 | REGON: 525908776 | NIP: 5214029021

Designed & Developed by: MultiColor Designs

Shopping cart0
There are no products in the cart!
Continue shopping
0